DNN న్యూస్, బోగోలు, ధర్మాజీగూడెం, ఏలూరు | జూన్ 1, 2026
ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగోలు గ్రామ ఔట్కట్స్ వద్ద నిర్వహించిన మెరుపుదాడిలో నలుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న గారికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టగా, కొందరు వ్యక్తులు అక్రమంగా పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దాడి నిర్వహించగా, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.9,650 నగదు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించాలని ఆయన కోరారు.

Great job 👏 Police 🚔.