DNN NEWS కథనంతో ముందుకు కదిలిన గ్రామపంచాయతీ సిబ్బంది
📍 ఎడవల్లి గ్రామం | లింగపాలెం మండలం | ఏలూరు జిల్లా
DNN NEWS కథనంతో కదిలిన అధికారులు, ఎడవల్లిలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం, స్వయంగా పర్యవేక్షించిన సెక్రటరీ, డిప్యూటీ ఎంపీడీవో, ప్రజా సమస్యపై వెంటనే స్పందించిన గ్రామపంచాయతీ సిబ్బంది.
ఎడవల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందంటూ DNN NEWSలో ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను గుర్తించిన అధికారులు డ్రైనేజీ కాలువల శుభ్రత పనులను చేపట్టారు.
పంచాయతీ సెక్రటరీ సుగుణ రాజు, లింగపాలెం మండల డిప్యూటీ ఎంపీడీవో సుందరి స్వయంగా పర్యవేక్షిస్తూ పంచాయతీ సిబ్బందితో డ్రైనేజీ కాలువలను శుభ్రపరచించారు.
గ్రామ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నాయుడు మహేష్ పాల్గొని అధికారులతో కలిసి పనులను పరిశీలించారు.
గ్రామ ప్రజలు సమస్యపై వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన అధికారులకు, అలాగే ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన DNN NEWSకు కృతజ్ఞతలు తెలిపారు.
🖋️ రిపోర్టర్: DNN NEWS ప్రత్యేక కథనం.
📍 ఎడవల్లి గ్రామం | లింగపాలెం మండలం | ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

ఎడవల్లి గ్రామ ప్రజలు ఇలాంటి పంచాయతీ సిబ్బందికి ఎల్లప్పుడూ ధన్యవాదాలు తెలపాలి.
Great Job. Keep Going.