కైకలూరు ప్రధాన రహదారిపై నిల్వ ఉన్న డ్రైనేజీ మురుగునీరు... ప్రమాదాలకు ఆహ్వానం
కైకలూరు ప్రధాన రహదారిపై నిల్వ ఉన్న డ్రైనేజీ మురుగునీరు... ప్రమాదాలకు ఆహ్వానం
కైకలూరు , జూన్ 5 (DNN News):
కైకలూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టినప్పటికీ, గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలోని ప్రధాన రహదారిపై డ్రైనేజీ మురుగునీరు నిల్వ ఉండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని తెలిపారు. రహదారిపై నీరు నిల్వ ఉండటం వల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మురుగునీటి కారణంగా దుర్వాసన వ్యాపిస్తోందని, పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించి, శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల సమస్యలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, వాహనదారులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
🖋️ రిపోర్టర్: DNN NEWS ప్రతినిధి
📍 కైకలూరు, ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక

Officials need to react and provide immediately the solutions.