📍 రైల్వేకోడూరు | జూన్ 12, 2026 | శుక్రవారం | DNN NEWS
రాష్ట్రంలోని అర్హులైన వికలాంగులు, వృద్ధులు, వితంతువులు మరియు అనారోగ్య బాధితులందరికీ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలని ఏపీ వికలాంగుల పెన్షన్దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జేఎన్ ఆంధ్రయ్య ప్రభుత్వాన్ని కోరారు.
శనివారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే వికలాంగులకు ఇంటి స్థలాలు కేటాయించి, పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేశారు.
వికలాంగులు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.
🖋️ DNN NEWS ప్రతినిధి రైల్వేకోడూరు
📍 రైల్వేకోడూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక :::
