జగిత్యాల పట్టణంలోని జీవన్ రెడ్డి గారి కార్యాలయంలో మాజీ మంత్రి BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు న్యాయవాది తాటిపర్తి రాంచంద్ర రెడ్డి గారు యువజన నాయకులు తాటిపర్తి CK రెడ్డి గారు జగిత్యాల కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జీవన్ రెడ్డి గారు జాతీయ జెండా ఆవిష్కరించారు.
ప్రొఫెసర్ జయ శంకర్ చిత్ర పటానికి పులమాలలు వేసి, నివాళులు అర్పించారు.
కెసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో బషీర్ బాగ్ కాల్పులకు చలించి, తెలంగాణ ప్రాంత ప్రజల కడగండ్లు తీరాలంటే తెలంగాణ రాష్ట్రం అవసరమని కెసిఆర్ తన ఉప సభాపతి పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించారు.
దేశములోని అన్ని పార్టీలను ఒప్పించి, తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది.
కెసిఆర్ తెలంగాణ సాధన కోసం ఉద్యమించుకుంటే ఈ నాడు తెలంగాణ రాష్ట్రమే ఉండేది కాదు..
దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకునేందుకు రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మార్చారు.
ఆడబిడ్డలకు అండగా నిలవాలని కళ్యాణ లక్ష్మీ, షాది ముభాకర్ ప్రవేశ పెట్టిన పథకాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
దేశంలో ఎక్కడ లేని విధముగా విద్యా సదుపాయాల కోసం అత్యధికంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు.
పది జిల్లాలని ముప్పై జిల్లాలుగా ఏర్పాటు చేసి, జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి తీసుకువచ్చి, చరిత్రలో నిలిచిపోయారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకొని, వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాల కోసమే పాలన సాగిస్తున్నారు.
వరి ధాన్యం కొనుగోలులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగలుగా తయారై
రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదు.
సీఎం రేవంత్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ డీజీల్ పై వ్యాట్ తగ్గించాలి.
తెలంగాణ కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన కానుక అన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం కోసం మలి దశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రిపోర్టర్ మొహమ్మద్ సల్మాన్
జగిత్యాల జిల్లా.


Good One..