కొయ్యూరు బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మహిళా కూలీలు మృతి.
రోడ్డు దాటుతుండగా టిప్పర్ లారీ ఢీకొన్న ఘటన మరో ఇద్దరి పరిస్థితి విషమం
DNN న్యూస్ డెస్క్ కాకినాడ:
జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొయ్యూరు బ్రిడ్జి వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సత్యవతి, కృష్ణమ్మ, చిట్టెమ్మ, అన్నవరం అనే మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా స్థానిక టీడిగ్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు.
ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరిని అత్యవసర చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మృతుల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదంపై స్పందించిన మంత్రి పొంగూరు నారాయణ:
“ఈ ప్రమాద ఘటన చాలా బాధాకరం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించాం.”
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:
“నలుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.”
ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. టిప్పర్ లారీ వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
Dnn న్యూస్ కొయ్యూరు బ్రిడ్జ్ కాకినాడ.

Very bad, so sad.